Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

Super Admin Jul 25, 2026 6:28 PM చిత్తూరుabout 1 hour ago
ఉమ్మడి చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి - Udayam Digital
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రమైన కరువు తాండవిస్తోందని, తక్షణమే ఈ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు డిమాండ్ చేశారు. జిల్లా ఎదుర్కొంటున్న తీవ్ర కరువు పరిస్థితులపై సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హాల్లో జరుగుతున్న సమావేశం ఎదుట భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సమావేశం జరుగుతున్న హాల్లో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ని కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...