Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్ జోన్ ఎత్తివేయాలని అఖిలపక్ష నాయకుల డిమాండ్

Follow Udayam on Google
p.g.murthy Sep 14, 2026 7:07 PM మంచిర్యాలGeneral
టైగర్ జోన్ ఎత్తివేయాలని అఖిలపక్ష నాయకుల డిమాండ్ - Udayam
టైగర్ జోన్ ఎత్తివేస్తేనే జన్నారం మండల అభివృద్ధి సాధ్యమవుతుందని అఖిలపక్ష నాయకులు శ్రీనివాస్, అశోక్ అన్నారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 23 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక పోరాట సమితి భూమా చారి కి ఆదివారం సాయంత్రం వారు మద్దతు తెలిపారు. అటవీ అంశాలతో పాటు ఎక్కువ జోన్ అమలు చేయడంతో ఇసుక రాక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...