వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు నిబంధనలకు విరుద్ధంగా 32 ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ను గండేపల్లి పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. జంతు హింసకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు.
కంటైనర్లో కింద, పైన లేయర్లలో 16 చొప్పున ఎద్దులు ఉన్నాయి. కేసు నమోదు చేసి వాటిని పిఠాపురం గోశాలకు తరలించనున్నట్లు ఎస్సై శివ నాగబాబు తెలిపారు.
Comments
Loading comments...

