వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారిపై ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...
