వార్తలకు తిరిగి వెళ్లండి
టాప్-10 క్రీడా దేశాల్లో భారత్

2036 నాటికి ప్రపంచంలోని టాప్-10 క్రీడా దేశాల జాబితాలో భారత్ నిలవడం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన జూడో క్లస్టర్ పోటీలను ఆయన ప్రారంభించారు.
ఖేలో ఇండియాకు బడ్జెట్లో రూ.4,800 కోట్లు కేటాయించామని చెప్పారు. సీఐఎస్ఎఫ్ నియామకాల్లో 179 మంది మహిళలు చేరడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో 1,600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...