వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో విద్యార్థి సంఘాలు నేడు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రులకు సమాచారం అందించాయి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Loading comments...

