వార్తలకు తిరిగి వెళ్లండి
పొగాకు రైతుల తీవ్ర ఆవేదన

రెండేళ్లుగా పంటకు సరైన మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి వద్ద పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్తో భేటీ అయిన రైతులు, తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. పంట కొనుగోళ్లు లేక ఆర్థికంగా కుదేలవుతున్నామని తమ కష్టాలను వివరించారు.
Comments
Loading comments...