వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి కొత్త వంతెన కింద బడ్డీ కొట్టు వద్ద తండ్రి, కొడుకులపై దాడి జరిగింది. పెదరావూరుకు చెందిన వీరు ఉదయం మద్యం సేవించి షాపు వద్దకు వచ్చి ఖైనీ ప్యాకెట్ అడిగారు.
ఈ క్రమంలో డబ్బాలు కిందపడటంతో షాపు నిర్వాహకులు ఆగ్రహించి ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం. ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వంతెనపై ఉన్న ట్రాఫిక్ పోలీసులు గమనించి ఆటోలో ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

