వార్తలకు తిరిగి వెళ్లండి

నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పాస్పల్లి తండాలో రోడ్డు పక్కనే ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రహదారిపై రాకపోకలు సాగించే ప్రజలు పశువులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకముందే అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

