Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:47 AM తిరుపతిGeneral
తిరుమల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ - Udayam
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. యాగశాలలో భూమాతకు పూజలు చేసి పుట్టమన్నులో నవధాన్యాలు నాటారు. మంగళవారం సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...