వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండలం తిమ్మాయిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఇంకుడు గుంత నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలను సంరక్షించుకోవచ్చని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు.
ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం దీనికి సబ్సిడీ అందిస్తోందని సర్పంచ్ రాజు ముదిరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

