Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరికి మూడో ముప్పు హెచ్చరిక

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 01, 2026 8:45 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
గోదావరికి మూడో ముప్పు హెచ్చరిక - Udayam Digital
భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 55 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. వరద ఉద్ధృతితో ఏజెన్సీ ప్రాంతాల్లో పలు రహదారులపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...