వార్తలకు తిరిగి వెళ్లండి

కోటనందూరులోని భోగలింగేశ్వర స్వామి ఆలయంలో వెండి ధారాపాత్ర చోరీకి గురైంది. గురువారం రాత్రి ఆలయం మూసివేసిన అర్చకులు శుక్రవారం ఉదయం 5 గంటలకు రాగా తలుపులు తెరిచి ఉన్నాయి. పరిశీలించగా స్వామివారి లింగంపై ఉన్న 2.5 కిలోల వెండి ధారాపాత్ర కనిపించలేదు.
అర్చకుడు ఈవో సత్యనారాయణకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ, క్లూస్ టీం ఆలయంలో పరిశీలించి చోరీ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

