Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఓకేలో ఉద్రిక్తతలు భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణల్లో 37 మంది మృతి

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Jul 31, 2026 1:51 PM అల్ ఇండియా అంతర్జాతీయ
పీఓకేలో ఉద్రిక్తతలు భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణల్లో 37 మంది మృతి - Udayam Digital
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీఓకే) జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో మహిళలు, పిల్లలతో సహా కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు. పీఓకేలో ప్రాంతీయ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ ఉద్రిక్తతలు తలెత్తాయి. అణచివేతకు వ్యతిరేకంగా తమ శాంతియుత పోరాటం కొనసాగుతుందని జేఏఏసీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...