వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఎస్బీఐ వద్ద నిరాహార దీక్షకు దిగారు.
వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయడంతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
Comments
Loading comments...

