Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి చినరావూరు పార్క్ చెరువులో చేపల మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 1:12 PM గుంటూరుGeneral
తెనాలి చినరావూరు పార్క్ చెరువులో చేపల మృతి - Udayam
తెనాలి చినరావూరు పార్క్ చెరువులో పెద్ద ఎత్తున చేపలు మృతి చెంది తేలుతూ కనిపించడం కలకలం రేపింది. బుధవారం ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు వీటితో పాటు కొన్ని విషసర్పాలు కూడా చనిపోయి ఉండటం చూసి ఆందోళన చెందారు. వీటి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు వెంటనే చెరువును పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...