వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కొత్తగా 10 ప్రభుత్వ బీఎస్సీ, ఒక పీజీ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కౌన్సిల్ బలోపేతంపై సమీక్షించిన ఆయన, జీఎన్ఎం విద్యార్థుల కోసం పోస్ట్ బేసిక్ బీఎస్సీ కోర్సులను అందుబాటులోకి తేవాలని సూచించారు.
నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టును కొత్తగా సృష్టించి, మిడ్ వైఫరీ కోర్సులను బలోపేతం చేయాలని మంత్రి కోరారు. కార్యాలయానికి వచ్చే విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

