వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని మూడు గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 మంది ఆదివారం టీఆర్ఎస్ లో చేరారు.
నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ గౌడ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సామాజిక న్యాయం,
పేదల సంక్షేమం, ఉచిత వైద్యం, విద్య, యువతకు ఉపాధి, రైతుల అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని సంపత్ గౌడ్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు.
Comments
Loading comments...

