వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...
