వార్తలకు తిరిగి వెళ్లండి

నేరళ్లపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రేవల్లి భూపాల్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు. నేరళ్లపల్లికి చేరుకుని భూపాల్ మృతదేహానికి నివాళులర్పించిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెలంగాణ సాధనలో భూపాల్ కృషి మరువలేనిదని, ఆయన మరణం తీరని లోటని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. భూపాల్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Comments
Loading comments...

