Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌ పర్యటనకు ఇద్దరు తెలంగాణ ఉపాధ్యాయులు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 9:57 AM నిజామాబాద్తెలంగాణ
జపాన్‌ పర్యటనకు ఇద్దరు తెలంగాణ ఉపాధ్యాయులు - Udayam
ప్రభుత్వ ఉపాధ్యాయుల విజ్ఞాన పర్యటనలో భాగంగా జపాన్‌ వెళ్లే 40 మంది బృందంలో తెలంగాణకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. నిజామాబాద్‌కు చెందిన అమర్‌ లక్ష్మినాథ్‌, కామారెడ్డికి చెందిన పి.ప్రవీణ్‌కుమార్‌కు చోటు దక్కింది. జపాన్‌లోని పాఠశాల విద్యా విధానాలు, బోధనా పద్ధతులను వారు పరిశీలించనున్నారు. అక్కడి విద్యా విధానాలపై అవగాహన పొందనున్నారు.

Comments

G
Loading comments...