వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి పట్టణంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో పులిప్రొద్దుటూరుకు చెందిన నారాయణస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే స్థానిక అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పుట్లూరు నుండి వచ్చిన వాహనంలో క్షతగాత్రుడిని తరలించాల్సి వచ్చింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

