వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండలో గురువారం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ట్యాంకు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆయనను కోరారు.
అనంతరం కేంద్ర నిధులు రూ.36 లక్షలతో నిర్మించనున్న విలేజ్ క్లినిక్కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

