Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామి ఆలయానికి శంకుస్థాపన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 7:38 PM గుంటూరుGeneral
స్వామి ఆలయానికి శంకుస్థాపన - Udayam
కొల్లిపర మండలం గుద్ది బండివారిపాలెంలో శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామస్థులు శనివారం శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా ఇక్కడి పుట్టలో వెలసిన స్వామివారిని భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా, సంతాన ప్రాప్తిని ప్రసాదించే దైవంగా భావించి పూజిస్తున్నారు. స్వామికి భవ్య మందిరాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఊరి ప్రజలంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...