వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సురక్ష గణపతి సన్నిధిలో శుక్రవారం అన్నదానం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి పాల్గొని ప్రజలు, పోలీసు సిబ్బందికి భోజన ప్రసాదాలు వడ్డించారు.
జిల్లా శాంతిభద్రతలు సక్రమంగా కొనసాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

