వార్తలకు తిరిగి వెళ్లండి

వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో పట్టపగలు ఓ వ్యక్తిపై వేట కొడవలితో దాడి జరిగింది. పాల వ్యాపారి భుజంగరావు (60)పై సురేంద్రసింగ్ దాడి చేసినట్లు సమాచారం. గుర్రంగూడలోని ఓ ప్లాట్ వివాదమే దాడికి కారణంగా తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన భుజంగరావును కామినేని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం నిందితుడు వనస్థలిపురం పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది.
Comments
Loading comments...

