Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంకు రాఖీ కట్టిన సురేఖ, సీతక్క

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:08 AM హైదరాబాద్General
సీఎంకు రాఖీ కట్టిన సురేఖ, సీతక్క - Udayam
రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాఖీలు కట్టారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి విడివిడిగా వెళ్లి వారు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. గతంలో మాదిరిగానే సురేఖ ఈసారి కూడా సీఎంకు బంగారు రాఖీ కట్టారు. కుమార్తె వ్యాఖ్యల వివాదం తర్వాత ఆమె సీఎం ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. పలువురు మహిళా నేతలు, అంధుల పాఠశాల విద్యార్థినులు కూడా సీఎంకు రాఖీలు కట్టారు.

Comments

G
Loading comments...