వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న ఆ పార్టీ మండల నేతలను బసంత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
శాంతియుతంగా పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని అరెస్టు అయిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి శ్రీనివాస్, మాదాసు శ్రీనివాస్, సతీష్, అరవింద్, శ్రీధర్, కుమార్, శంకర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

