వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు అందరికీ ఉంటాయని, వాటికి ఆత్మహత్య పరిష్కారం కాదని పెంటపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రీమన్నారాయణ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కళాశాల ఆధ్వర్యంలో మానవహారం, అవగాహన సదస్సు నిర్వహించారు.
క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని ప్రిన్సిపల్ హితవు పలికారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

