వార్తలకు తిరిగి వెళ్లండి

చక్కెర ధరలు వారం రోజుల్లో రూ.7కుపైగా పెరగడంతో వినియోగదారులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కిలో చక్కెర ధర రూ.52కు చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.54-55 వరకు విక్రయిస్తున్నారు.
సరఫరా తగ్గడం, చెరకు దిగుబడి క్షీణించడం వల్ల ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. పెరిగిన ధరలతో సామాన్యులపై అదనపు భారం పడుతుండగా, వినియోగం కూడా తగ్గుతున్నట్లు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

