Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీ వల నుంచి తప్పించుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 2:32 PM నారాయణపేటతెలంగాణ
ఏసీబీ వల నుంచి తప్పించుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌ - Udayam
భవనం సేల్‌డీడ్‌ రిజిస్ట్రేషన్‌కు రూ.1.10 లక్షలు లంచం డిమాండ్‌ చేసి, చివరకు రూ.90 వేలకు ఒప్పందం కుదిరినట్లు పేట సబ్‌ రిజిస్ట్రార్‌పై ఆరోపణలు వచ్చాయి. బాధితుడు ఇప్పటికే రూ.60 వేలు చెల్లించినట్లు సమాచారం. మిగతా రూ.30 వేలు ఇవ్వాలని కోరడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు వల పన్నినా సబ్‌ రిజిస్ట్రార్‌ డబ్బు తీసుకోకుండా చివరి క్షణంలో తప్పించుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...