వార్తలకు తిరిగి వెళ్లండి

భవనం సేల్డీడ్ రిజిస్ట్రేషన్కు రూ.1.10 లక్షలు లంచం డిమాండ్ చేసి, చివరకు రూ.90 వేలకు ఒప్పందం కుదిరినట్లు పేట సబ్ రిజిస్ట్రార్పై ఆరోపణలు వచ్చాయి. బాధితుడు ఇప్పటికే రూ.60 వేలు చెల్లించినట్లు సమాచారం.
మిగతా రూ.30 వేలు ఇవ్వాలని కోరడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు వల పన్నినా సబ్ రిజిస్ట్రార్ డబ్బు తీసుకోకుండా చివరి క్షణంలో తప్పించుకున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

