Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపారెడ్డి హత్యలో విద్యార్థులే!

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 7:47 AM నల్గొండతెలంగాణ
రూపారెడ్డి హత్యలో విద్యార్థులే! - Udayam
నల్గొండ జిల్లా నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి హత్య కేసులో పదో తరగతి విద్యార్థుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. ఒక విద్యార్థికి మరో విద్యార్థి సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. మూడు ప్రత్యేక బృందాలు సుమారు 80 మందిని విచారించాయి. విద్యార్థుల్లో ఒకరిని ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందించారు. హత్యకు కారణాలు ఇంకా వెల్లడికాలేదు.

Comments

G
Loading comments...