వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలోని మూడు వైద్య కళాశాలల్లో కలుషిత ఆహారం తిని 78 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
సెంట్రల్ క్యాంటీన్లో వడ్డించిన ఆకుకూర పప్పే కారణమని విద్యార్థులు ఆరోపించారు. ఆహార నాణ్యతపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...
