వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో ఈ ఏడాది గణేశ్ విగ్రహాల ఎత్తు 16 అడుగులకు మించకుండా తయారు చేయాలని సీపీ సజ్జనార్ విగ్రహాల తయారీదారులకు సూచించారు. గత ఏడాది రవాణా సమయంలో నాలుగు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఎలక్ట్రిక్ వైర్లు, ఫ్లైఓవర్లు, మెట్రో నిర్మాణాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, విగ్రహాల బుకింగ్ వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులకు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...
