వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది. రాష్ట్రంలో రెండు రోజులపాటు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
Comments
Loading comments...

