వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు, మదనపల్లె, రాయచోటి పట్టణాల్లో వాణిజ్య భవనాల సెల్లార్లను పార్కింగ్కు బదులు దుకాణాలుగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాహనాలను రోడ్లపై నిలపడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
పార్కింగ్ సౌకర్యాలు లేకుండా వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నిబంధనలు అమలు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు అత్యవసర సమయాల్లో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

