వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్ర స్థాయి నవోదయ ఖో-ఖో పోటీలు ప్రారంభం

వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో రాష్ట్ర స్థాయి నవోదయ ఖో-ఖో పోటీలను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఎస్పీ పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించడమే అసలైన క్రీడాస్ఫూర్తి అని విద్యార్థులకు సూచించారు.
Comments
Loading comments...