Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 2:42 PM ఆల్ ఇండియా జాతీయ
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా తొక్కిసలాట జరిగింది. బారికేడ్లలో విద్యుత్‌ ప్రసారం అవుతోందన్న వదంతితో భక్తులు పరుగులు తీయడంతో 13 మంది గాయపడ్డారు. నాగచంద్రేశ్వర స్వామి వార్షిక దర్శనాల కోసం భారీగా భక్తులు తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...