వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఈ ప్రాంతంలో భారీగా నీరు చేరి కుంటను తలపిస్తోంది. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డుపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

