వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ మండలం గాంధీనగర్ గ్రామం వద్ద శ్రీరాంసాగర్ జలాశయం నుంచి సరస్వతి కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని ఏఈఈ శ్యామ్ ఆదివారం విడుదల చేశారు.
రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకుని పంటలను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని అధికారులు సూచించారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు కృషితో సరస్వతి కాలువకు సాగునీటి విడుదలకు అధికారులు చర్యలు చేపట్టారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

