Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయంలో 100 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

Follow Udayam Digital on Google
శ్రీశైలం జలాశయంలో 100 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ - Udayam Digital
ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలతో శ్రీశైలం జలాశయానికి కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి జలాశయంలో నీటి నిల్వ 101.9210 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,53,543 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 924 క్యూసెక్కులుగా ఉంది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల పెరగడంతో జూరాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...