Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పీజీఆర్‌ఎస్‌కు 234 అర్జీలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:29 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం పీజీఆర్‌ఎస్‌కు 234 అర్జీలు - Udayam
శ్రీకాకుళం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 234 అర్జీలు నమోదయ్యాయి. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 100, పంచాయతీరాజ్‌కు 28, సర్వే సెటిల్‌మెంట్స్‌కు 19 వినతులు వచ్చాయి. సారవకోట, పాతపట్నం, కోటబొమ్మాళి, జలుమూరు, టెక్కలి మండలాల నుంచి సుమారు 200 మంది ఎస్టీ ఏనేటి కొండ్ల గిరిజనులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం కలెక్టర్‌ను ఆశ్రయించారు. సమస్యను పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...