వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం తలమర్ల, గోరంట్ల పరిసరాల్లో బొగ్గు భట్టీల నుంచి మహారాష్ట్రకు చెందిన 40 మంది కార్మికులను అధికారులు రక్షించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్, కార్మిక శాఖలు చర్యలు చేపట్టాయి.
కార్మికులకు విడుదల ధ్రువపత్రాలు ఇచ్చి, అక్రమ రుణాలు రద్దు చేశారు. వైద్యం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు. బాధ్యులపై కేసులు నమోదు చేశారు.
Comments
Loading comments...

