వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట పంచాయతీలో సర్ నోటీస్ హియరింగ్ సభను స్థానిక ఎంపీడీవో మధుసూదన్, తాసిల్దార్ దిలీప్ కుమార్ పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం వారు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నోటీసుదారులు ఇస్తున్న ధ్రువ పత్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
నోటీసులు అందుకున్న వారు ఎలక్షన్ కమిషన్ సూచించిన 14 ధ్రువ పత్రాలలో ఏదో ఒకటి అధికారులకు ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

