వార్తలకు తిరిగి వెళ్లండి

ఆషాఢ బోనాల సందర్భంగా మీరాలం మండి శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికింది.
ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్.. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, సీఎం రేవంత్ రెడ్డికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.
Comments
Loading comments...

