Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెంచులకు ఆధార్ నమోదు వేగవంతం చేయాలి

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 07, 2026 3:50 PM నాగర్ కర్నూల్General
చెంచులకు ఆధార్ నమోదు వేగవంతం చేయాలి - Udayam
నల్లమల్ల ప్రాంత చెంచు గిరిజనులకు ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, ఆగస్టు 15లోగా వెయ్యి నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మారుమూల తండాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చిన్నారుల ఆధార్ నమోదును వేగంగా పూర్తి చేయాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా చూడాలన్నారు.

Comments

G
Loading comments...