వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో సింగరేణి విశ్రాంత ఉద్యోగి మాధయ్య(70) హత్య కేసులో కుమారుడు బాపురావును పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో బండరాయితో కొట్టి హత్య చేసినట్లు సీఐ తెలిపారు.
తండ్రితో ఉంటున్న బాపురావు తరచూ డబ్బుల కోసం వేధించేవాడని పోలీసులు వెల్లడించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

