వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం పుల్కల్ మండలం బదరిగూడెంకు చెందిన నిండు గర్భిణి అనిత (30) మృతి చెందింది. తొలి కాన్పు కోసం చేరిన ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు ఆస్పత్రి ఆర్ఎంవో తెలిపారు.
అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

