Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో రోడ్డు ప్రమాదం ఢీకొన్న రెండు బస్సులు

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 10:13 AM రాజన్న సిరిసిల్లGeneral
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సును వేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూల్ బస్సు కిటికీ అద్దాలు ధ్వంసమై, గాజు ముక్కలు తగిలి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...