Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR-2026 ప్రక్రియ పకడ్బందీగా జరపాలి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 12, 2026 11:50 AM చిత్తూరుఆంధ్రప్రదేశ్
SIR-2026 ప్రక్రియ పకడ్బందీగా జరపాలి - Udayam
SIR-2026లో నోటీసులు, విచారణలు, పత్రాల పరిశీలనను పారదర్శకంగా నిర్వహించాలని చిత్తూరు డీఆర్వో కె.మోహన్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏఈఆర్వోలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,34,310 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉందన్నారు. ముసాయిదా జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్‌ 3న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...